కళ్యాణదుర్గంలో జనసేన-తెలుగుదేశం ఆత్మీయ సమావేశం
కళ్యాణదుర్గం, రెండు పార్టీల అధిష్టానం ఆదేశాల మేరకు గురువారం “జనసేన-తెలుగుదేశం” రెండు పార్టీల సమన్వయ సమావేశం భారీ స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున టిడిపి ఇన్చార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు మరియు జనసేన పార్టీ తరఫున నియోజవర్గ జనసేన సమన్వయకర్త బాల్యం రాజేష్ అధ్యక్షత వహించగా, అనంతపురం జిల్లా నుండి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా ఈ సమావేశానికి 5 మండలాల జనసేన అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-16-at-16.52.21-1005x1024.jpeg)