శ్రీకాంత్ కు..వారి కుటుంబానికి అండగా జనసేన: గాదె

పర్చూరు కౌలు రైతు భరోసా యాత్రలో గాయపడిన చిలకలూరిపేటకి చెందిన తెల్లమేకల శ్రీకాంత్ ను గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరామర్శించారు… ఆరోగ్య, కుటుంబ విషయాలను అడిగి తెలుసుకున్నారు…ఈ విషయం తెలిసిన వెంటనే నాదెండ్ల మనోహర్ జిల్లా అధ్యక్షులను సంప్రదించి వారికి ఎటువంటి సమస్యకైనా పార్టీ అండగా ఉంటుంది అని భరోసా కల్పించాలి అని తెలిపారు.. అలాగే అధ్యక్షలు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిన వెంటనే పార్టీ ఆఫీస్ నుంచి 25000/- పంపించారు. భావిషత్ లో మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా యిచ్చారు..

గాయపడిన శ్రీకాంత్ కు తెనాలి పట్టణంలో శాస్త్రచికిత్స చేయించి ఇంటికి చేర్చారు….

శ్రీకాంత్ కు పాతిక వేల రూపాయల ఆర్థిక సాయాన్ని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేసారు.. ఇందుకు పార్టీ కార్యకర్తలు జిల్లా నాయకులు అందరు సహకరించారు…

రాష్ట్ర కారదర్శి రవికాంత్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని చెప్పారు..

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి రాజా రమేష్, శిఖా బాలు, సతీష్, రాము, సుబాని, భాష, వెంకట్రావు, సాంబశివరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.