అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి అండగా జనసేన

చంద్రగిరి, రాయలచెరువు పంచాయతీ, రామచంద్రాపురం మండలంలోని వెంకటేష్ అనే ఆటో డ్రైవర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వెంకటేష్ భార్య దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు జనసేనపార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర వాళ్ళని పరామర్శించారు. వారి కుటుంబానికి చంద్రగిరి నాయకులు దేవర మనోహర మరియు మండల అధ్యక్షులు సంజీవి హరి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు స్టేట్ సెక్రటరీ శ్రీమతి సుభాషిని, చంద్రగిరి నియజకవర్గ నాయకులు దేవర మనోహర, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి, తిరుచానూరు మండల అధ్యక్షులు వెంకట్ రాయల్, చంద్రగిరి మండల అధ్యక్షులు కిషోర్ ఆశ, కిరణ్ పాల్గొన్నారు.