సైదాపురం జగనన్న కాలనీలో పర్యటించిన జనసేన

గిద్దలూరు నియోజక వర్గం కంభం మండలం సైదాపురం గ్రామంలో జగనన్న కాలనీలో పర్యటించిన జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు సైదాపురంలో జగన్న కాలనీ ఏర్పాటు 129 ఇళ్లు మంజూరు చేసినారు, ఇప్పటి వరకు కేవలం 2ఇల్లు మాత్రమే పూర్తి స్లాబ్ వేశారు. ఇక్కడ స్మశానం ప్రక్కన ఇల్లు నిర్మించుకొనుటకు ప్రజలు ఇష్టపడటం లేదు, ఒక ఇల్లు నిర్మించాలంటే ప్రభుత్వం ఇచ్చే 180000 వేలు సరిపోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వైసిపి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నారని జగనన్న ఇల్లు నిర్మించిన వారికి కన్నీళ్లు ఆని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లంకా నరసింహారావు, కాల్వ బాల రంగయ్య, ఉదయగిరి మల్లికార్జున, మండలం అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, కళగొట్ల అల్లురయ్య, సిద్ధం వెంకటేశ్వర్లు, వీరనాల గోపాల్, శేషాద్రినాయుడు, గాజుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.