ఉచితంగా నీటి కనెక్షన్ ఏర్పాటు చేసిన జనసేన వీరమహిళ
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని 28 వ వార్డ్ ప్రజలు ఎండాకాలం రాకముందే నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఉచితంగా నీటి కనెక్షన్ ఏర్పాటు చేసిన జనసేన వీరమహిళ సరస్వతి. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ మేము ఈ రోజున సామాన్య ప్రజలకు ఏదైనా చేస్తున్నాం అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూపిన సేవా మార్గమే జనసేన పార్టీ ప్రజలకు ఏ సమస్య వచ్చిన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాజ్ ప్రకాష్, వన్నూ శ్రీరాములు, కుమార స్వామి, కార్పెంటర్ రాజు, మీసాలు ఆది తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-18-at-18.04.13-1024x480.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-18-at-18.04.37-480x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-18-at-18.04.37-1-477x1024.jpeg)