శ్రీశ్రీశ్రీ ఆత్కూరి మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న జనసేన వైస్ ఎంపిపి

అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, కుమ్మరి శాలి వాహన సంఘం వారు రాజోలు కాటన్ పార్క్ వద్ద ఏర్పాటుచేసిన ఏర్పాటు చేసిన తొలి తెలుగు మహిళ కావయిత్రి తెలుగు రామాయణ రచయిత్రి శ్రీశ్రీశ్రీ ఆత్కూరి మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజోలు జనసేన పార్టీ వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు పాల్గొన్నారు. అనంతరం ఆనందరాజుకు శాలువా కప్పి మొమెంటో అందజేశారు. ఆనందరాజు మాట్లాడుతూ మొల్లమాంబ విగ్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. అలాగే కుమ్మరసాలి వాహన సంఘం వారిని మీరు కూడా రాజకీయంగా ముందుకు రావాలని కోరుతూ మా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుందని ఆనంద రాజు హామీ ఇచ్చారు.