ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 34వ రోజు

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం 34వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: తొట్టంబేడు మండలం, పొయ్య పంచాయతీలోని గురుకుల పాలెం, గురుకుల పాలెం ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, గాబచేను గ్రామాల్లో బుధవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది.
రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. నిత్యావసర ధరలు పెంపు, కరెంట్ బిల్లు పెంపు, పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్టు బ్రతకడమే కష్టంగా మారిందని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్ర శేఖర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పట్టణ ఇంఛార్జి తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, ఉపాధ్యక్షుడు రవికుమార్ రెడ్డి, జ్యోతి రామ్, ప్రధాన కార్యదర్శులు పేట చిరంజీవి, నాయకులు లక్ష్మి, కవిత, శారద, సురేష్, రాజేష్, గురవయ్య, హేమంత్, జనసైనికులు తేజ్ కుమార్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.