చాపలమడుగులో జనసేన పల్లెబాట

ఎర్రగొండపాలెం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సూచనల మేరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం “జనసేన పల్లెబాట” కార్యక్రమం పుల్లలచెరువు మండలంలోని చాపలమడుగు పంచాయతీలో మధ్యాహ్నం 3 గంటలకు జనసేన పల్లెబాట కార్యక్రమం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో చాపలమడుగు పంచాయతీ కమిటీ ప్రకటించబడింది. చాపలమడుగు పంచాయతీ అధ్యక్షుడిగా పగడాల మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులుగా మొగిలి రాఘవరావు, తుంగా సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శులుగా బోడ వీరప్ప నాయుడు, బండారు మణికుమార్ లను ప్రకటించటం జరిగింది. మండల అధ్యక్షుడు కొటారి అచ్చయ్య, పాతకోటి వెంకట సుబ్బారావు (ప్రకాశం జిల్లా కార్యదర్శి) నియోజకవర్గ కమిటీ మెంబర్ కొసన ప్రసాద్, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పాల్గొని “జనసేన పల్లె బాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.