ఎర్రగొండపాలెంలో జనసేన పల్లెబాట
ఎర్రగొండపాలెం, జనసేన ఇంచార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి, డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్ ఆదేశానుసారము, పుల్లలచెరువు మండలం, మర్రిపాలెం గ్రామం, జనసేన పల్లెబాట కార్యక్రమంలో, రాష్ట్రంలో జనసేన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, కౌలు రైతుల భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమం, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఎండగడుతునారని గ్రామ ప్రజలందరికీ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొటారి అచ్చయ్య మర్రివేముల జనసేన గ్రామ అధ్యక్షుడు కటకం వీరాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన నాయకుడు బంటు కిష్టఫర్ మరియు జనసేన జిల్లా నాయకులు, అధికార ప్రతినిధులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-11-at-21.54.59-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-11-at-21.56.43-1024x473.jpeg)