కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన

రాయదుర్గం నియోజకవర్గం, కణేకల్ మండలం నాగేపల్లి గ్రామంలో యర్రగుడి నాగార్జున (36) అనే కౌలురైతు పంట నష్టాలతో అప్పుల బాధతాళలేక తన ఇంట్లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ ఇంచార్జి మంజునాథ్ గౌడ వాళ్ళ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం నుండి రావాల్సిన పరిహారాన్ని ఇప్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. కణేకల్ మండల కన్వినర్ ఎస్ రవి కుమార్ రాయదుర్గం మండల కన్వినర్ హర్ష పోరల్ నాయకులు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాన్ని అధికార పార్టీ నాయకులు కనీసం పలకరించకపోవడం చాలా బాధాకరం.