Sullurupeta: వట్రపాలెం గ్రామంలో పర్యటించిన జనసేన

సూళ్లూరుపేట మండలం వట్రపాలెం గ్రామంలో పర్యటించిన జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బురకాల లీలా మోహన్
సూళ్లూరుపేట మండలం వట్రపాలెం గ్రామంలోని వరద ముప్పుతో ఇబ్బందు పడుతున్న ప్రజలను ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుకోవడం జరిగింది వారు ప్రధానమగా ఎదుర్కొంటున్న సమస్యలు

  1. నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతంలో ఈ ప్రాంతం మొదటి స్థానం
  2. వట్రపాలెం ఇంటి పట్టాలు ఇచ్చినప్పటి నుండి ఎటువంటి వసతులు లేని ప్రాంతం కూడా ఇదే.
  3. వరద ముప్పు ఉన్నప్పుడు ఈ గ్రామనికి ఏ సహాయం అందలేదు.
  4. దాదాపు 10 సంవత్సరాలు నుండి రహదారులు కూడా లేవు.

ఏ గవర్నమెంట్ అధికారి, నాయకులు కానీ పట్టించుకోలేదు అని ఆ గ్రామంలోని ప్రజలు సూళ్లూరుపేట నియోజకవర్గం యువ నాయకులు బురకాల లీలా మోహన్ కి చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నిటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి సహాయం అందే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పుల్లయ్య, వెంకీ, మురళి, రఫీ, సన్నీ పాల్గొనడం జరిగింది.