జనసేన పార్టీ ఆదేశాలను పాటిస్తూ పార్టీని బలోపేతమే ధ్యేయంగా పనిచేస్తా: చిల్ల మహేష్ బాబు

కదిరి మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షునిగా చిల్ల మహేష్ బాబును పార్టీ అధిష్టానం నియమించినట్లు ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా చిల్ల మహేష్ బాబు మాట్లాడుతూ కదిరి మండలం జనసేన పార్టీ కన్వీనర్ గా (మండల అధ్యక్షునిగా) నియమించిన జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కి, శ్రి నాదెండ్ల మనోహర్ కి, జనసేన రాష్ట్ర నాయకులకు, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ కి, PAC మెంబర్ శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డికి కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ భైరవకి మరియు జిల్లా కమిటీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానని, కదిరి మండలంలోని ప్రతి ఒక్క జనసైనికునికి పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదములని, నేను ఎల్లప్పుడూ మీ అందరి నిర్ణయాలను గౌరవిస్తూ, జనసేన పార్టీ ఆదేశాలను పాటిస్తూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తానని. ఈ సందర్భంగా జనసేన నాయకులకు మరియు కదిరి మండలంలోని ప్రతి ఒక్క జనసైనికునికి తెలియజేస్తున్నానని అన్నారు.