దత్తిరాజేరు మండలంలో జనంతో జనసేన

విజయనగరం జిల్లా జనంతో జనసేన కార్యక్రమాన్ని దత్తిరాజేరు మండలంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో సరయ్యవలస, వీ కృష్ణాపురం, భూపాల్ రాజపురం మరియు గదసాము గ్రామంలో జనసైనికులని కలిసి పలువురు నాయకులను జనసేన పార్టీలో చేరికల కోసం కృషి చేయడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గం నాయకులు గెద్ధ రవి మరియు దత్తిరాజేరు మండలం జనసైనికులు మామిడి దుర్గా ప్రసాద్ మరియు మురళి, బి అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెద్ధ రవి మాట్లాడుతూ వీలైనంత తొందరగా మండలంలో అన్ని గ్రామాల ప్రజలను కలిసి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని చెప్పడం జరిగింది.