ఇంటింటికి జనసేన మాటలు

అరకు నియోజకవర్గంలో ఇంటింటికి జనసేన మాటలు తీసుకెళ్ళు భాగంగా బుధవారం జనసేన ఎక్స్ ఎం.పి.టి.సి సాయి బాబా, దురియా, అల్లంగి, రామకృష్ణ అరకు వేలి మండలం మాడాగాడా పంచాయితీ హెడ్క్వార్టర్ కుమ్మర వీధిలో పర్యటించారు. ముందుగా గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. అయితే నేటికి ఏ ప్రభుత్వం కూడా వారిని గిరిజనులుగా గుర్తించి ప్రభు త్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం లేదని, ఎన్నో ఏళ్లుగా గిరిజన ఆచారాలు, సాంప్రదాయాలకు, అనుగుణంగా జీవిస్తున్న మాకు ఇంతవరకు గిరిజనులుగా గుర్తించి న్యాయం చేయక పోవడం తో తీవ్రంగా నష్టపోతున్నట్లు జనసేన దృష్టికి తీసుకొచ్చారు. గెజిట్ 23 లో వారికి నాయాక్ గా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు వారిని గిరిజనులుగా గుర్తించకపోవడం తో విద్యా పరంగా, వైద్యపరంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకి అందని ద్రాక్ష వల్లే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందిస్తూ జనసేన ఎక్స్ ఎం పి టి సి సాయి బాబా, రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ సమస్యలను అధినేత జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని.. వారికి సూచించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి సమస్యలను స్పందిస్తూ గిరిజనులను గుర్తించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.