నదిచాగి గ్రామంలో జనసేన కార్యవర్గ సమావేశం
- కేవలం జనసేన పార్టీకి చెందిన వారని ఇంటి నిర్మాణం మంజూరు చేయకపోవడం బాదాకరం
మంత్రాలయం నియోజకవర్గం: కౌతాళం మండలం, నదిచాగి గ్రామంలో బుధవారం నిర్వహించిన జనసేన సమావేశంలో మంత్రాలయం జనసేన తాలుకా నాయకులు పొంత నరసింహులు పాల్గొనడం జరిగినది. ఈ సమావేశంలో అయ్యమ్మ చంద్రశేఖర్ల దంపతులు ఇంటి నిర్మాణం మంజూరు కొరకు వినతి పత్రం సమర్పించినా ప్రభుత్వము నుండి ఎటువంటి సహాయం అందలేదని వారు సమావేశంలో వివరించడం జరిగింది. కేవలం జనసేన పార్టీకి చెందిన వారని బిల్లు మంజూరు చేయలేకపోవడం జరిగింది. దీన్ని జిల్లా నాయకులకు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని వాళ్లకు వివరించడం జరిగింది. జనసైనికులు కానీ, అభిమానులు కానీ ఏ పార్టీ వాళ్లకు భయపడకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని నియోజకవర్గ నాయకులు పొంత నరసింహులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోసిగి మండలానికి చెందిన చింతలగేని వీరారెడ్డి, నాగేంద్ర, జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-28-at-10.00.22-PM-1024x768.jpeg)