కార్యకర్తలకు కొండంత అండగా జనసేన
పాలకొండ నియోజకవర్గం: జనవరి నెలలో కిమ్మి గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు జనసేన నాయుకులు రెడ్డి గోవింద్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది. గురువారం విశాఖపట్నంలో జరుగుతున్న జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రెడ్డి గోవిందా కుటుంబ సభ్యులకు 5,00,000 రూపాయల చెక్ ను జనసేన పార్టీ తరఫున అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా పాలకొండ నియోజకవర్గ నాలుగు మండలాల జనసేన నాయుకులు మాట్లాడుతూ ఎలాంటి అధికారం లేకపోయినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఎంతో ఆలోచన చేస్తున్నారని అర్థం అవ్వుతుంది. ఇలాంటి సేవ కార్యక్రమాలు చేసే పార్టీ ఒక్క జనసేన మాత్రమే అని ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన 148 మంది జనసైనికుల కుటుంబాలకు 8కోట్ల 45 లక్షల రూపాయలు అందించిన ఘనత జనసేన పార్టీదే. అలానే 800 మంది గాయపడ్డ కార్యకర్తలకు సుమారు 45 కొట్ల రూపాయలు అందించిన గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఏ పార్టీ కూడా ఇలా చేసే పార్టీలు లేవు. కేవలం ఒక్క జనసేన పార్టీ మాత్రమే అలాంటి జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఐతే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడైన తెలుసుకొని జనసేన పార్టీకి అండగా ఉండాలిసిన సమయం ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయుకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-17-at-19.50.44-1024x568.jpeg)