శృంగవరపు కోటలో జనసేనాని జన్మదిన వేడుకలు

శృంగవరపు కోట, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎస్.కోట నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎస్.కోటలో గండవరపు సతీష్ అధ్వర్యంలో విజయా బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో 50 మంది జనసైనికులు రక్తదానం చేశారు. విఆర్.పేటలో అప్పన్నదొర జాని అధ్వర్యంలో 30 మంది రక్త దానం చేశారు. షేఖ్ పిరోజ్ అధ్వర్యంలో 25 మంది రక్తదానం చేశారు. జామి వర్మ రాజు అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలన్నీ ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ, వబ్బిన సన్యాసి నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భవన నిర్మాణ కార్మికులకు బిర్యాని పాకెట్స్, ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు పండ్లు, బిస్కెట్ పాకెట్స్ బిర్యాని పాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి.రాజశేకర్ ఎస్.కోట మండల పార్టీ అధ్యక్షులు లోకబి రామకోటి, చిన్ని, చంటి, మల్సువల్స,నాని, కారుకొండ రవి తదితరులు పాల్గొన్నారు.