భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో జనసేనాని జన్మదిన వేడుకలు
శింగనమల నియోజకవర్గం: నార్పల మండల జనసేన ఆధ్వర్యంలో ఆ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 52వ జన్మదిన వేడుకలు భవననిర్మాణ కార్మికులతో కలసి ఆధినేతకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కార్మికులతో కేక్ కట్ చేయించి అందరికీ పంచి పెట్టడం జరిగింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఇసుక విధానాల వల్ల పనులు లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే కార్మికుల పట్ల ఎంత ఆంకిత భావంతో పని చేస్తారో తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రప్రథమంగా ప్రభుత్వంపై ధ్వజమెత్తి విశాఖ వేదికగా జనసేనాని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారని గుర్తు చేసారు. కార్మికులతో కలసి జనసేనశ్రేణులు సహా పంక్తి భోజనం కార్యక్రంలో పాల్గొని దాదాపు 100 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులకి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ సీనియర్ నాయకులు తుపాకులకు భాస్కర్, కొండి శెట్టి ప్రవీణ్ కుమార్, కలువాయి విశ్వనాథ్ రెడ్డి, పొన్నతోట రామయ్య, ఉట్టి నరసింహులు, లోకేష్, నారాయణస్వామి, రాజకుల్లయప్ప, హరీష్, దాడితోట శివయ్య, అశ్వర్థ రెడ్డి, సుభహన్, రమణయ్య, రాము, రామంజి, మధు మరియు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-02-at-4.54.09-PM-1024x576.jpeg)