భూపాలపల్లిలో బిజేపికి జనసేన పూర్తి మద్దతు: జేరిపోతుల సనత్ కుమార్

తెలంగాణ, భూపాలపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ జేరిపోతుల సనత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భూపాలపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ జేరిపోతుల సనత్ కుమార్ జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డిని కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అందించి వారికి కూడా జనసేన కండువా కప్పి భూపాలపల్లిలో బీజేపీ కి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ జేరిపోతుల సనత్ కుమార్ మాట్లాడుతూ భూపాలపల్లిలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు. భూపాలపల్లి నియోజకవర్గం వెనకబడిపోవడానికి కారణం గత పాలకులే అని, భూపాలపల్లి అభివృద్ధి జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అని విశ్వాసం ఉందన్నారు. అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చాము ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి భూపాలపల్లిని అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ భూపాలపల్లి నియోజకవర్గంలో సంపూర్ణ మద్దతూ తెలుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు. జనగాం పవన్, పైడిమల్ల రాజు, నితిన్, దేవేందర్, తేజ, బద్రి, తదితరులు పాల్గొన్నారు.