ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే జనసేన లక్ష్యం

  • జనసైనికుడు మంజునాథ్ కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత

కార్యకర్తలను, నాయకులను సమానంగా చూస్తూ.. ఉంటూ ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా పార్టీ బలోపేతం కోసమే పని చేసిన చిలమత్తురు మండలం, పగలపల్లికి చెందిన నిస్వార్థ జనసైనికుడు కీ.శే మంజునాథ్ క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్నందున ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిమిత్తం పూర్తి సమాచారాన్ని జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, చనిపోయిన కార్యకర్త మంజునాథ్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కుని జిల్లా నాయకులకు పంపించి, వారి కుటుంబసభ్యులకు అందజేయవలసినదిగా సూచించారు. ఈ మేరకు బుధవారం జనసేన ద్వారా 5 లక్షలు రూపాయల చెక్కుని చిలకం మధుసూధన్ రెడ్డి చేతులమీదుగా మంజునాథ్ కుటుంబసభ్యులకు చెక్కుని అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో భవానీ రవికుమార్, ముఖ్య అతిథిలు జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్, జిల్లా నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.