జగనన్న కాలనీల దుస్థితిపై జనసేన వినతిపత్రం
దెందులూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నవంబర్ 12,13,14 తారీఖుల్లో దెందులూరు నియోజకవర్గంలోని జగనన్న కాలనీలలో చేసిన సామాజిక తనిఖీలో గుర్తించిన జగనన్న కాలనీల దుస్థితిపై సోమవారం స్పందన కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ముత్యాల రాజేష్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు, బొడ్డు గిరిబాబు, లింగారావుగూడెం జనసేన నాయకులు పలిపే ప్రవీణ్ కుమార్ జనసేన పార్టీ తరపున వినతిపత్రం అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-21-at-7.55.22-PM-1024x576.jpeg)