పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు జనసేన సంఘీభావం

పాలకుర్తి నియోజకవర్గం: పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి వెల్తూరి నగేష్ ఆధ్వర్యంలో ఆదివారం తొర్రూర్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ నాయకులు పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచే పారిశుద్ధ కార్మికులకు సరైన వేతనం ఇవ్వాలని జనసేన పార్టీ పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటుందని ఈ సమస్యను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో ఉన్న పారిశుద్ధ కార్మికుల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి వెల్తూరి నగేష్ తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తొర్రూరు మండల అధ్యక్షులు కొండ్లె ఉమేష్, జనసైనికులు గాడి పెళ్లి సంతోష్, చింతల మధుకర్, గట్ల సతీష్, పోరండ్ల సందీప్, జక్కుల శంకర్, చింతల సందీప్, ఆకారపు సురేష్ మారోజు రాజశేఖర్ పాల్గొన్నారు.