త్రాగునీటి సమస్యపై జనసేన పోరాటం

దర్శి సాగర్ జలాలను త్రాగునీటిగా మార్చే ప్రక్రియలో నీరుని శుభ్రం పరచే కార్యక్రమంలో తీసుకోవలసిన సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఆ కలుషిత నీరు తాగడం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ సమస్యను ప్రజలు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు దృష్టికి తీసుకురాగా స్పందించిన వరికూటి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ పరిష్కారం చేస్తామని దీనిపైన పోరాటనికైనా సిద్ధమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ దర్శి టౌన్ జనసేన నాయకులు షేక్ ఇర్షద్, ఓబులాపురం ఏడుకొండలు, అబ్బు సుబ్బు రామయ్య మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.