ఈదరాడలో జనసేన మూడవవిడత క్రియాశీలక సభ్యత్వాలు నమోదు
రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమం జరిగింది. జన సేన పార్టీ అధిష్టానం ఆదేశాలు మేరకు మూడవ విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు ఈదరాడ గ్రామంలో సెంటర్లో డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద నుండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసారు. గ్రామం లోని ప్రతి గడపకు వెళ్ళి జనసేన పార్టీ గురించి వివరిస్తూ పార్టీకి అండగా నిలబడిన వాళ్ళ కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏవిధంగా అండగా నిలబడు తున్నారో వివరిస్తూ, సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ అందిస్తూన్న సేవలను వివరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-14-at-16.04.50-1024x577.jpeg)