నేడు నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పర్యటన

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నివర్ తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్న పవన్ ఆపై రైతులను పరామర్శించనున్నారు. కృష్ణా జిల్లా పరిధిలో కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. అనంతరం పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లా భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో జనసేనాని పర్యటించనున్నారు.