జనసేవకుడు పిండి సాయిబాబా జయంతి

  • పిండి సాయిబాబా విగ్రహావిష్కరణ

అమలాపురం: జనసేన పార్టీపట్టణ మాజీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ స్వర్గీయ పిండి సాయిబాబా 61వ జయంతి వేడుకలు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో అమలాపురం చెన్న మల్లేశ్వర కళాపరిషత్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసినపిండి సాయిబాబా విగ్రహాన్ని స్థానిక మహిళామణుల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు హాజరై సాయిబాబా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జనసేన అమలాపురం ఇంఛార్జి శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు మాట్లాడుతూ.. వార్డు ప్రజలకోసం నిరంతరం శ్రమించే ‘జన సేవకుడు’ సాయిబాబా మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన సేవలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. సాయిబాబా అమర్ రహే’అంటూ నినాదాలు చేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలతో పాటు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకట రాజు (నాని రాజు), మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు, తెలుగుదేశం కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, వైసిపి కౌన్సిలర్ కట్టోజు సన్నాయి దాసు, జనసేన కౌన్సిలర్లు గండి హారికస్వామి, తిక్కా సత్య లక్ష్మి ప్రసాద్, గొలకోటి విజయలక్ష్మి వాసు, కొప్పుల నాగ మానస, మోకా వెంకట సుబ్బారావు, అరిగెల తేజ వెంకటేష్, సాయిబాబా సతీ మణి, వార్డ్ కౌన్సిలర్ పిండి అమరావతి, కుటుంబ సభ్యులు, 6,7 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.