రక్తదాన శిబిరంలో పాల్గొన్న జనసైనికులు

టెక్కలి నియోజకవర్గం: రానున్న స్వాతంత్ర దినోత్సవం మరియు అభయం ఫుడ్ బ్యాంకు ప్రధమ వార్షికోత్సవ సందర్బంగా ఆదివారం అభయ సేవా సంఘము అధ్యక్షులు దేవాది శ్రీనివాస్ రావు మరియు మెలియాపుట్టి మండల సేవా సంఘ ముఖ్య సలహాదారులు జన్ని ధర్మారావు పిలుపు మేరకు రక్తం చిందించి ప్రాణ త్యాగం చేసి మన దేశానికీ స్వతంత్రం సాంధించి పెట్టిన ఎందరో మహనీయులును స్మరించుకుంటూ ఆపదలో ఉన్న అభాగ్యలను ఆదుకునే ఆశయంతో ఆదివారం టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో జనసేన పార్టీ నుండి జనసైనికులు రక్తదానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మిపురం కిరణ్, జయపురం రవి, వంశీ, చిరంజీవి మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.