ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జయంతి

సమస్యలకు భయపడి పారిపోవడం కాదు, ఎదిరించి నిలవండి, పోరాడండి అంటూ, యువతకు పిలుపునిచ్చిన మహానీయడు శ్రీ స్వామి వివేకానంద స్పూర్తితో యువత ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తూ, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్, వైస్ ప్రెసిడెంట్ యాసంనేని అజయ్ క్రిష్ణా, ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గుండ్ల పవన్ కళ్యాణ్, గుంత సత్యనారాయణ, జనసేన కార్యకర్తలు మాలిక్ తదితరులు పాల్గొని వివేకానందుని విగ్రహానికి పూలమాలవేసి, పుష్పగుచ్ఛాలు వుంచి ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.