JEE 2020: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల లింక్

దేశంలోని ప్రతిష్టాత్మ విద్యాసంస్థలైన ఐఐటీలలో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ముందుగా చెప్పిన షెడ్యూల్ ప్రకారం సోమవారం 10 గంటలకు ఐఐటీ ఢిల్లీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

JEE Advanced Results 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి Resultslink

సెప్టెంబర్ 27న జరిగిన అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో 1,51,311 మంది పేపర్-1కు, 1,50,900 మంది విద్యార్థులు పేపర్‌-2కు హాజరయ్యారు. నేడు విడుదలయ్యే ఫలితాలతో మొత్తం 13,600 సీట్లను భర్తీ చేస్తారు. రేపటి నుంచి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 13 వరకు మొత్తం ఆరు విడుతల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది.