పెనుగొండ జనసేన ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి మహోత్సవం

ఆచంట నియోజవర్గం: పెనుగొండ మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అసమాన ధీశాలి, అపూర్వ యుద్దనిపుణురాలు, మేధా శక్తి సంపన్నురాలు, స్వాతంత్ర్య సేనాని, ఝాన్సీరాణి లక్ష్మీబాయి 194వ జయంతి మహోత్సవం పెనుగొండ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ కంబాల బాబులు, పెనుగొండ గ్రామ ప్రెసిడెంట్ యర్రంశెట్టి బాబురావు, వీర మహిళలు మేకల చంద్రకుమారి, బొరుసు కళ్యాణి, కంబాల సుజాత, కొత్త కోటేశ్వరి, కాకి వెంకటలక్ష్మి, ముత్యాల వరలక్ష్మి, బండారు అన్నపూర్ణ, కంబాల వెంకట గిరిధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆమె స్ఫూర్తితో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీర మహిళా విభాగం స్థాపన చేసిన సంగతి మనందరికీ విదితమే ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ జనసేన ముందుకువెల్లడం మరెందరికో ఆదర్శం.