జింక అంబరీష్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు
ధర్మవరం, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డితో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కలిసి ఇటీవల ధర్మవరం పట్టణంకు చెందిన జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జింక అంబరీష్ ప్రమాదవశాత్తు చిత్రావతి నదిలో పడి అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి జింక అంబరీష్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి జనసేన పార్టీ వారికి ఎల్లవేళలా తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-10-at-20.07.43-1024x768.jpeg)