2021లో కొలువుల జాతర..!

2021లో నూతన సంవత్సరం పురస్కరించుకొని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొలువుల జాతర చేయనుంది. ముచ్చటగా మూడు స్పెషల్‌ డీఎస్సీ, లిమిటెడ్‌ డీఎస్సీ, రెగ్యులర్‌ డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఫిబ్రవరిలోపు లిమిటెడ్‌ డీఎస్సీ, స్పెషల్‌ డీఎస్సీ వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వనుంది. గత డీఎస్సీలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరిలో లిమిటెడ్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుండగా.. దివ్యాంగ విద్యార్ధులకు బోధించేందుకు స్పెషల్ బీఈడీ చేసినవారి కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించనున్నారు.

ఈ రెండు డీఎస్సీలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాగా.. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. ఇక టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తర్వాత రెగ్యులర్ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. కాగా, ఇటీవల ఎస్‌ఈఆర్టీ టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.