జోగి రమేష్ పై పెడన జనసైనికుల దండయాత్ర

  • పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరిన జోగి రమేష్ కి చుక్కలు చూపించిన జనసైనికులు

పెడన, పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు చూసినా పసలేని ఆరోపణలు, సత్యదూర విమర్శలతో పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ మంత్రి జోగి రమేష్ తన కుటిల రాజకీయ బుద్ధిని ఉపయోగించి మాట్లాడాడని పెడన జనసైనికులు అన్నారు. అంతేకాక జోగి రమేష్ కు దమ్ము ధైర్యం ఉంటే తన పదవీకాలంలో పెడన నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు నిర్మిస్తాడో చెప్పాలని సవాలు విసిరారు. పెడన నియోజకవర్గాన్ని జోగి రమేష్ అతని అనుచరులు దోచుకు తింటున్నారని ఘాటుగా విమర్శించారు. జోగి రమేష్ ఒక మట్టి దొంగ అని, నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మండలానికి ఒక అనుచరుడు అక్రమ మట్టి దందా చేస్తూ ప్రతినెలా జోగి రమేష్ కి ముడుపులు చెల్లిస్తారని అన్నారు. కృత్తివెన్ను మండలంలోని వందల ఎకరాల మడ అడవులను, సి.ఆర్.జడ్ భూములను ఆక్రమించుకుని చేపల చెరువులు త్రవ్వి లీజికిస్తున్నాడని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని, సమస్యలను గాలికి వదిలేసి మరొకసారి ఇలాంటి గాలి మాటలు మాట్లాడితే నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. పెడన నియోజవర్గ మండల అధ్యక్షులు కార్యవర్గం జన సైనికులు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి పెడన మండల అధ్యక్షుడు వూచా వెంకయ్య పెడన మండలం వైస్ ప్రెసిడెంట్ చీరల నవీన్ కృష్ణ, కృత్తివెన్ను మండలం వైస్ ప్రెసిడెంట్ పాశం నాగమల్లేశ్వరరావు గూడూరు మండలం జనరల్ సెక్రెటరీ శీరం సంతోష్ పెడన మండలం కార్యదర్శిలు పినిశెట్టి రాజు దాసరి నాని పెడన మండలం జనరల్ సెక్రెటరీ మోటేపల్లి సురేష్ మరియు కోనపురెడ్డి రంగయ్య కోట నాగరాజు భీమవరపు పరమేశ్వర రావు బత్తిన రమేష్ గరికపాటి శ్రీరామ్ ముదినేని రామకృష్ణ పాల్గొనడం జరిగింది.