దాడి చేస్తే రాష్ట్రం అట్టుడుకుపోతుందని హెచ్చరించిన జాన్ బాబు

పుజారా, యూఏఈ జనసేన అధ్యక్షులు పెనుమాల జాన్ బాబు పత్రికా ముఖంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై దాడికి ప్రయత్నించాలని చూస్తే ఊరుకునేది లేదని ప్రతిదాడికి కూడా జనసైనికులు సిద్ధంగా ఉన్నారని, దాడి చేస్తే రాష్ట్రం అట్టుడుకుపోతుందని, అధినేతను అనుసరించి సంయమనం పాటిస్తున్నారే తప్ప చేతకాక కాదని ఈ సందర్భంగా తెలిపారు. జనసైనికుల ఆగ్రహావేశాలను తట్టుకోలేరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు. దీనిపై తెలంగాణా ప్రభుత్వం స్పందించి విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. కేంద్రప్రభుత్వం తక్షణమే స్పందించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతా సిబ్బందిని పెంచాలని కోరడం జరిగింది.