హీరోగా ఎంట్రీ ఇస్తున్న జానీ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా.. సుజి విజువల్స్ బ్యానర్పై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్న సినిమా నేడు లాంఛనంగా ప్రారంభమైంది. కే వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. వీవీ వినాయక్ తొలి షాట్కు గౌరవ దర్శకత్వం వహించిన క్లాప్ కొట్టారు. నటుడు నాగబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ చిత్రంలో ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సందర్బంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ..జానీ మాస్టర్ డెఫినెట్గా వండర్పుల్ యాక్టర్ అవుతారు. ఎంటర్టైనింగ్ హీరోగా అవుతారనే నమ్మకం బలంగా కలిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. వాటితో దర్శకుడు అభిరుచి ఏమిటో తెలిసింది. త్వరలోనే జానీ మాస్టర్తో స్టైల్2 సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాం. చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయనతో మున్ముందు అసోసియేట్ కావాలనుకొంటున్నాను. ఈ చిత్రంలో నటిస్తున దిగంగనకు, యూనిట్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
హీరోయిన్ దిగంగన సూర్యవంశీ మాట్లాడుతూ..జానీ మాస్టర్తో నటించడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ బ్రిల్లియెంట్. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు నా నిర్మాత, దర్శకులు, రచయితలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.