బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, నూజివీడు మండలం, ముక్కోలుపాడు గ్రామానికి చెందిన గ్రామ జనసేన నాయకుడు అశోక్ ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు చేతులు మీదగా జనసేన కండువాలు కప్పించుకొని 20 కుటుంబాల యువత జనసేన పార్టీలో చేరడం జరిగింది. అనంతరం బర్మా ఫణిబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తపన పేదవాడి గుండె చప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయాలని ఈరోజు ముక్కోల్లుపాడు గ్రామానికి చెందిన యువత జనసేనపార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందని, ముందు ముందు నూజివీడు నియోజవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేస్తానని అలానే ఉమ్మడి అభ్యర్ధి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సెంట్రల్ ఆంధ్ర ఎన్నికల నిర్వహణ కమిటి సభ్యులు పాశం నాగబాబు, తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, వీర మహిళలు జక్కుల లక్ష్మి, రామిశెట్టి తేజస్విని, పసుపులేటి సంతోష్, గొల్లపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.