జనసేన పార్టీలో చేరికలు

రంపచోడవరం నియోజవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి రంపచోడవరం మండలం వేములుకొండ పంచాయతీ ఎట్టుచిలకల గ్రామం 42 కుటుంబాలు మంగళవారం కుర్ల రాజశేఖర్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వైసీపీ పాలనతో విసిగిపోయి ప్రజలు అభివృద్ధి లేదు ఉపాధి లేదు అప్పులు ఊబిలో చిక్కుకున్న ఏపీ ప్రభుత్వం అభివృద్ధి ఉపాధి కావాలంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమని రాజశేఖర్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న రంపచోడవరం నియోజవర్గ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, కొనతం శ్రీనివాస్, పంచాయతీ నాయకులు కొర్ల రమణారెడ్డి, సాదుల రామిరెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.