జనసేన పార్టీలో చేరికలు

రంపచోడవరం నియోజకవర్గం: మరేడుమిల్లి మండలం, బొడ్డలంక గ్రామ పంచాయతీలో మారేడుమిల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మల్ల దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో, గాదె ధర్మ తేజ సమక్షంలో ముఖ్య అతిథిథులుగా కుర్లా రాజశేఖర్ రెడ్డి ఘనంగా గ్రామ ప్రజలకు జనసేన పార్టీ నందు కండువాలు వేసి ఆహ్వానించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చిన 40 కుటుంబాలను జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన నాయకులు కుర్లా రాజశేఖర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలును వివిధ కారణాలు చూపి గిరిజనులకు దూరం చేయడం జరుగుతుంది. వైసిపి స్థానిక నాయకులు వల్ల ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని దానివల్ల గిరిజనులు ఎంతో నష్టపోతున్నారని ఆయన మాట్లాడారు. ఈ నాలుగు సంవత్సరాలలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఏ రహదారులను చూసిన చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం నినాదం వల్ల గిరిజన గ్రామాలు చైతన్యవంతమై అభివృద్ధి చెందుతాయని మాటిచ్చారు. ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొణాతం శ్రీనివాస్ సర్పంచ్ సాధన ప్రేమ్ కుమార్ రెడ్డి పల్లాల సార్ది రెడ్డి పల్లాల వీర ప్రసాద్ రెడ్డి సాధన శ్రీనివాస్ రెడ్డి సాధన ధర్మారెడ్డి సాధన రంగారెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.