బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు

నరసాపురం: జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వం నచ్చి, నరసాపురం నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ నాయకులు తెన్నేటి సురేష్, గరికపూడి జేమ్స్ రాజు, తెన్నేటి ఏసు బాబు, బాలం శ్రీను, మెట్టపల్లి సుందర్ సింగ్, తెన్నేటి శేఖర్ బాబు, చిట్టం చిట్టిబాబు, మూటూరి లావణ్య కుమార్, బాలం శ్రీను, మోటుపల్లి రంగారావు, మల్లవరపు నాగేంద్ర, అయినపూడి ప్రభాకర్ మరియు దాదాపుగా 30 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.