బత్తుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, చక్రద్వారబంధం గ్రామానికి చెందిన టీడీపీ, వైసీపీ పార్టీకి చెందిన పలువురు రాజానగరం నియోజకవర్గం జనసేన ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ బత్తుల బలరామకృష్ణ జనసేన కండువా వేసి మర్యాదపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరిన వారు చోడసాని ధర్మరాజు, సుంకర భాస్కర రావు, ఈవూరి శ్రీనివాస రావు, చోడసాని దిలీప్, సుంకర లీల భువనేశ్వర్, కుంచె దుర్గ ప్రసాద్, ఇతర నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చోడసాని శ్రీనివాస రావు, చక్రద్వారబంధం జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఆనందాల గోవింద్, కురుమల్ల మహేష్, చోడసాని శ్రీనివాస రావు, చోడసాని శ్రీనివాస రావు, భూషంశెట్టి అర్జున్, పితాని వెంకటేష్, చోడసాని శ్రీనివాస రావు, నాగవరపు చల్లారావు, చోడసాని నాని, భూషంశెట్టి వీరబాబు, చోడసాని శ్రీనివాస రావు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.