బత్తుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం రాజానగరం మండలం, పాత వెలుగుబంద గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదర ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.