మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలోని, పంట పాలెం పంచాయతీ, ఎం జి కాలనీలో జనసేన పార్టీ ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నాసిన శ్రీనివాసులు, వీరబాబు సమక్షంలో 40 మంది గిరిజనులు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మనుబోలు గణపతి మాట్లాడుతూ రాబోయే జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో గిరిజన సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన కుటుంబంలోకి ఆహ్వానించి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాసిన శ్రీను, వీరబాబుకి ధన్యవాదాలు తెలిపి మున్ముందు పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలాను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల ఉపాధ్యక్షుడు పోలూరు పెంచల నరసింహా, ప్రధాన కార్యదర్శి చినకంగారి కసుమూరు, తాండ్ర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.