శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

నెల్లిమర్ల: భోగాపురం మండలంలోని చిన రావాడ పంచాయతీకి చెందిన 50 కుటుంబాలు, వైసీపీ పాలనకి విసుగు చెంది జనసేన పార్టీలో శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. చినరావాడకి చెందిన ప్రాంతవాసులు మాట్లాడుతూ తమకు గత 20 ఏళ్ల నుండి కనీసం రోడ్డు సదుపాయం లేదని ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన తమకి ఓట్ల కోసం హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత కనబడకుండా వెళ్లేవారే అని, ఆ మాటలు నమ్మే 2019లో పడుకున్నా అప్పలనాయుడు కి ఓట్లు వేసి గెలిపించామని, కానీ తమకి ఇప్పటివరకు చేసింది ఏమీ లేదని వెల్లడించారు. లోకం మాధవి గారి సేవ, ప్రజల మీద ఆవిడకి ఉన్న ప్రేమను తమ ప్రాంతానికి మంచి చేస్తారని నమ్మకంతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని ఆ ప్రజలు తెలియజేశారు.