బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

రాజోలు మండలం, చింతలపల్లి గ్రామంలో రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసి, ఎస్సి నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా వారికి బొంతు ఆహ్వానించారు. అనంతరం రాజేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు అభినందిస్తూ వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అందరికీ మంచి జరుగుతుంది. మీ అందరికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో శృంగారపు లక్ష్మణరావు, సుబ్బారావు, మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, గ్రామాశాఖ అధ్యక్షులు పంగం తాతాజీ, పిప్పర లక్ష్మణరావు, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, మామిడిశెట్టి శ్రీనివాస్, కోళ్ళ వేణు, మధు, ప్రసాద్, విపర్తి సాయిబాబు, గుబ్బల రాజు, సుందర బుల్లబ్బులు, ముస్కుడి నర్సింహా స్వామి, తోట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.