కాకినాడ రూరల్ జనసేన పార్టీలో చేరికలు

కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ మండలం, తూరంగి గ్రామం, పగడాలపేట ప్రాంతానికి చెందిన యువత, పెద్దలు గ్రామ అధ్యక్షులు పితాని శివతేజ, చోడిపల్లి గంగాధర్ ఆధ్వర్యంలో సుమారు 25 మంది యువత సూరడా భైరస్వామి నాయకత్వంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. విరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సూరడా శ్రీనివాస్, సూరడా జగన్నాధం, దరిపల్లి కామరాజు సూరడా భూలోకం, సూరడా చిన శ్రీనివాస్, గుర్రాల నూకరాజు పిరమళ్ళ శ్రీను, కొనడా చిన్నారావు, కదిరి తాతిలు దుర్గారావు, బాలు, సత్తిబాబు రామకృష్ణ తదితరులు అనసేనలో చేరారు.