కొత్తపేట జనసేనలో వైసిపి, టిడిపి పార్టీల నుండి చేరిక

కొత్తపేట, ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో పలువురు బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనలోకి చేరడం జరిగింది. ర్యాలీ పార్టీ వద్ద టిడిపి, వైసిపి పార్టీలకు చెందిన బొచ్చుల సత్తియ్య, పులుపు వెంకటేశ్వర్లు, పులుపు శివసూర్యనారాయణ, గంగవరపు సాయి, కోనపల్లి వెంకన్న బొచ్చుల వెంకన్న, నరకుల నర్శింహమూర్తి, నడింపల్లి ప్రసాద్ రాజు, మదునూరి చైతన్య, మద్దూరి నాగశ్రీ, వంగా అన్నవరం, చెల్లు తాతయ్యపండు ఆయా పార్టీలు విడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి అహ్వనించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, బందెల గురవయ్య, మెర్ల నాగేశ్వరరావు, బందెల సత్తిబాబు, నామాల ఏసు, మద్దూరి రామకృష్ణ, మల్లిబాబు, మాకే వీరన్న, తుటారపు బాలసుబ్రమణ్యం, మెర్ల ఉదయ్ భాస్కర్, పువ్వుల రమేష్, ఫణి, తదితర మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.