వైసీపీ, టీడీపీల నుండి జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్: కాకినాడ గొడరిగుంటలో ఆదివారం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్, కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుదీర్ ల సమక్షంలో రూరల్ జనసేన నాయకులు శాండీ ఆధ్వర్యంలో ఏటిమోగ ప్రాంతానికి చెందిన మల్లాడి రాము నాయకత్వంలో వైసీపీ, టీడీపీకి చెందిన సుమారు 70 మంది యువత జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సిద్ధాంతాలు నచ్చి, సమస్యలపై స్పందించే విధానాలకి ఆకర్షితులై యువత పెద్దఎత్తున జనసేన పార్టీలో చేరుతున్నారని పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీలో చేరిన వారు మల్లాడి రాంబాబు, మల్లాడి శ్రీను, అరదడి మహేష్, ఒలేటి నూకరాజు, దుర్గా ప్రసాద్, భాస్కరరాజు, పట్టా దనశేఖర్, అంకడి మోసే, పాలేపు మాణిక్యాలు, సంగడి మహేష్, మైలు కళ్యాణ్, మల్లాడి శివ శంకర్, బొమ్మడి హరికృష్ణ, కోప్పడి అభిషేక్
పెనుపోటు దుర్గారావు తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో తూము బన్ను, విజయగోపాల్, రవిరాజ, శివతేజ, గణేష్ నాయుడు, నానీబాబు, మున్నా, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.