పాలకొండ జనసేనలో చేరికలు

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం, పాలకొండ, సీతంపేట మండలాల నుంచి జనసేన పార్టీలోకి పాలవలస యశస్విని ఆధ్వర్యంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కొంతమంది పార్టీలో చేరడం జరిగింది. గతంలో పి ఆర్ పి జిల్లా మహిళా కోఆర్డినేటర్ కర్రీ కళ్యాణి, కిమిడి సురేష్, పొట్నూరు శంకర్, సవర సింహాద్రి, సవర గణేష్, సవర రాజేష్, జడ్డు రాజేష్ తదితరులు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ నాయకులు జనసేన జానీ, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, జామి అనిల్ పాల్గొన్నారు.