కొత్తపేట ముస్లింమైనారిటీ వర్గం నుండి జనసేనలోకి చేరికలు

కొత్తపేట నియోజకవర్గం: కొత్తపేట మార్కెట్ వీధికి చెందిన ముస్లింమైనారిటీ వర్గం నుండి బుధవారం నాడు పార్టీ మండల ఉపాధ్యక్షులు చింతపల్లి సత్తిపండు ఆధ్వర్యంలో వాడపాలెం బండారు శ్రీనివాస్ కార్యాలయం నందు ముస్లిం సోదర సోదరీమణులు జనసేన పార్టీలో చేరడం జరిగింది.‌ నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు వారికి పార్టీ కండువా కప్పి అహ్వనించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు కోసం తమ వంతు సహకారం అందిస్తాం అని వారు తెలియచేయడం జరిగింది. పార్టీలో జాయిన్ అయినవారు
షేక్ బాజ్జీ, షేక్ ఆజ్ మునిషా, షేక్ ఆల్లీమా, షేక్ వలీయాంభీ, షేక్ మిరాభి, షేక్ లాల్బీ, షేక్ ఖాసింభి, షేక్ ఆలీషా, షేక్ చాంద్ భాషా, షేక్ వలీ, షేక్ ఆశిన్, షేక్ షాకీర్, షేక్ అక్బర్‌, షేక్ బీబీజా చేరారు. ఈ కార్యక్రమంలో మహాదశ బాబులు, చింతపల్లి ఈశ్వరరావు, బండారు భాస్కరరావు మరియు గ్రామంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.