బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

నరసాపురం మండలం మర్రితిప్ప గ్రామంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై దాదాపుగా 50 మంది యాదవ సోదరులు ఆ గ్రామ పెద్దలు చిమ్మిలి గోపినాగరాజు, నాగళ్ళ శ్రీను, గొర్ల సత్యనారాయణ, మన్నె రాంబాబు, చిమ్మిలి హేమసుందర్, చిమ్మిలి సురేష్, కైలా వెంకీ, కొల్లు వినయ్, దండుబోయిన వెంకటేష్ మరియు నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నరసాపురం మండల అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్ మరియు నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.